తెలంగాణ

telangana

By

Published : Jul 12, 2023, 4:45 PM IST

Updated : Jul 12, 2023, 9:53 PM IST

ETV Bharat / state

Congress Protest Against BRS : 'వచ్చేది మేమే.. 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చేది మేమే'

Telangana Free Electricity Controversy : రాష్ట్రంలో 'పవర్​ పాలిటిక్స్​' హైఓల్టేజీ డ్రామాను క్రియేట్ చేస్తున్నాయి. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ నేతల మధ్య చేలరేగిన ఉచిత విద్యుత్​ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా పోటాపోటీగా నేతలు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. విద్యుత్‌ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో కేసీఆర్​ ప్రభుత్వం ఉందని కాంగ్రెస్​ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో ఎక్కడైనా 24 గంటల కరెంట్‌ ఇచ్చినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమంటూ సవాల్​ విసురుతున్నారు. రేవంత్​ వ్యాఖ్యలను వక్రీకరించి.. సత్యాగ్రహ మౌనదీక్షను భగ్నం చేయడానికి బీఆర్​ఎస్ కుయుక్తులు పన్నుతోందని మండిపడుతున్నారు.

Congress
Congress

'వచ్చేది మేమే.. 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చేది మేమే'

Electricity War Between BRS And Congress :తెలంగాణలో మరో ఐదు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో పవర్​ పాలిటిక్స్​ అంశం తెరమీదకు వచ్చింది. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్​పై కాంగ్రెస్​ నేతలు చేసిన వ్యాఖ్యలను బీఆర్​ఎస్​ నేతలు అవకాశంగా మలుచుకుంటున్నారు. కాంగ్రెస్​ మరోసారి రైతులపై తమ నియంతృత్వ విధానాలను బయటపెట్టిందని గులాబీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై కాంగ్రెస్​ నేతలు సైతం స్పందిస్తున్నారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాటలకు తప్పుగా అర్థంవచ్చేలా బీఆర్​ఎస్​ నేతలు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌ఛార్జీ మాణిక్‌ రావు ఠాక్రే ధ్వజమెత్తారు. రైతులు, వ్యవసాయానికి చెందిన ఏ విషయంలో అయినా కాంగ్రెస్ మద్దతుగా ఉంటుందని తెలిపారు. ఆ విషయాన్ని వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌లో ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు రైతులకు కేసీఆర్‌ సర్కారు చేసిన దానికంటే.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఎక్కువే చేసి చూపిస్తామని చెప్పారు.

Revanth comments on free Current : కాంగ్రెస్​ వ్యాఖ్యలపై కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ఎంత దుష్ప్రచారం చేసినా.. బీఆర్​ఎస్​ ఈసారి అధికారంలోకి రావడం కల అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి అన్నారు. 'కల్వకుంట్ల అన్నా చెల్లెళ్లు “మూడు గంటలు” అని దుష్ఫ్రచారం చేసినా, మూడు చెరువుల నీళ్లు తాగినా… మీరు మూడో సారి అధికారంలోకి రావడం కల్ల. వచ్చేది కాంగ్రెస్.. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్' అంటూ ట్వీట్​ చేశారు.

Telangana Free Electricity Controversy :రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. కేటీఆర్​కు సవాల్‌ విసిరారు. భూ కబ్జాలతో బీఆర్​ఎస్​ నేతలంతా బాగా డబ్బులు కూడబెట్టకుని డబ్బులిచ్చి నిరసనలు చేస్తున్నారని ఆరోపించారు. ముందు విద్యుత్‌ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సిరిసిల్లా నియోజకవర్గంలో ఒక్కరితోనైనా 24 గంటల కరెంట్ ఇచ్చినట్లు నిరూపిస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు.

రేవంత్​ వ్యాఖ్యలను గులాబీ నేతలు వక్రీకరించారంటూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. పీసీసీ పిలుపు మేరకు వివిధ జిల్లా విద్యుత్​ ఎస్​ఈ కార్యాలయాల వద్ద నేతలు నిరసనలు చేశారు. నాణ్యమైన విద్యుత్‌ 8 గంటలు ఇస్తే సరిపోతుందని రేవంత్‌ అన్నారే తప్ప 24 గంటల ఉచిత విద్యుత్​కి వ్యతిరేకం కాదని కాంగ్రెస్​ స్పష్టం చేశారు.

మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై.. కేంద్రప్రభుత్వం రాజకీయకక్ష సాధింపునకు పాల్పడుతోందని ఆరోపిస్తూ గాంధీ భవన్​లో టీపీసీసీ నేతలు సత్యాగ్రహ మౌన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్​లు మహశ్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, సీనియర్ నాయకులు కోదండరెడ్డి, సునీతా రావ్ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 12, 2023, 9:53 PM IST

ABOUT THE AUTHOR

...view details