తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కాంగ్రెస్ శ్రేణులు

హైదరాబాద్​ హిమాయత్​నగర్​లో బిహార్, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​ఘడ్​కు చెందిన కార్మికులకు కాంగ్రెస్​ శ్రేణులు నిత్యావసర సరుకులను అందజేశారు. లాక్​డౌన్​ వల్ల పేదలు ఆకలికి అలమటించకూడదనే ఉద్దేశంతో తమ వంతు సాయం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

By

Published : May 21, 2020, 5:28 PM IST

congress-party-distributed-essentials-to-poor-at-himayatnagar
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కాంగ్రెస్ శ్రేణులు

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆదేశాల మేరకు.. ఆ పార్టీ శ్రేణులు నిరుపేదలను ఆదుకునేందుకు చురుకుగా పాల్గొంటున్నారు. హైదరాబాద్​ హిమాయత్​నగర్​లో ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​, ఏఐవైసీ ప్రధాన కార్యదర్శి అనిల్​కుమార్​, తదితరులు కలిసి పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

బిహార్, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​ఘడ్​ కార్మికులకు బియ్యం, పప్పు, కూరగాయలను పంపిణీ చేశారు. లాక్​డౌన్​ కారణంగా నిరుపేదలు ఆకలికి అలమటించకూడదనే ఉద్దేశంతో తమ వంతు సహాయం అందిస్తున్నట్లు దాసోజు శ్రవణ్​ తెలిపారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.

ఇవీ చూడండి:సత్వర పరిష్కారం కోసం ఇక 'టెలిమెడిసిన్​'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details