తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా మైనార్టీలకు వ్యతిరేకం: ఎంపీ సయ్యద్ - congress mp Syed Naseer Hussain

భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు చూస్తే.. ఆ పార్టీ మైనార్టీలకు వ్యతిరేకమని అర్థమవుతోందని కాంగ్రెస్​ ఎంపీ సయ్యద్​ నాసిర్​ హుస్సేన్​ ఆరోపించారు. దేశాభివృద్ధిని వెనక్కు నెట్టేవిధంగా కేంద్ర సర్కార్​ నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు.

congress mp Syed Naseer Hussain fires on bjp government
కాంగ్రెస్​ ఎంపీ సయ్యద్​ నాసిర్​ హుస్సేన్

By

Published : Feb 18, 2020, 6:26 PM IST

కాంగ్రెస్​ ఎంపీ సయ్యద్​ నాసిర్​ హుస్సేన్

కాంగ్రెస్​ 70 ఏళ్ల నుంచి దేశంలో సమన్యాయం కోసం పనిచేస్తోందని ఎంపీ సయ్యద్​ నాసిర్​ హుస్సేన్​ అన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తెచ్చిన బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని తెలిపారు. పార్లమెంట్​లో ఈ బిల్లుపై మరోసారి చర్చ జరగాలని డిమాండ్ చేశారు.

బడుగు వర్గాలు, మైనార్టీలకు భాజపా వ్యతిరేకమని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలే సాక్ష్యమని ఎంపీ హుస్సేన్​ అన్నారు. దేశంలో ఉద్యోగ కల్పన లేదని, పరిశ్రమలు రావడం లేదని వీటిని పక్కదారి పట్టించేందుకు ఎన్​ఆర్సీ, ఎన్​సీఆర్పీ, రిజర్వేషన్​ అంశాలను తెరపైకి తెచ్చిందని మండిపడ్డారు. ఉభయ సభల్లో రిజర్వేషన్​ బిల్లుపై కాంగ్రెస్ పోరాడుతోందని స్పష్టం చేశారు. ​

  • ఇదీ చూడండి : 'రైల్వే మంత్రులు సొంత రాష్ట్రాలనే అభివృద్ధి చేసుకుంటున్నారు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details