తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా బాధితులకు చికిత్స అందించే బాధ్యత ప్రభుత్వానిదే' - mla sudheer babu latest news

కరోనాను కట్టడి చేయడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మెచ్చుకుందో తెలిపాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. కరోనా బాధితులకు చికిత్స అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన వ్యాఖ్యానించారు.

congress mla sudheer babu on trs government
'కరోనా బాధితులకు చికిత్స అందించే బాధ్యత ప్రభుత్వానిదే'

By

Published : Aug 11, 2020, 6:39 PM IST

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడం ఇష్టం లేకుంటే... కొవిడ్-19 పేరుతో చికిత్స అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా వెంటిలేటర్ల కొరత ఉందన... వీటిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఏ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును మెచ్చుకుందో తెలుపాలని డిమాండ్ చేశారు.

'కరోనా బాధితులకు చికిత్స అందించే బాధ్యత ప్రభుత్వానిదే'

కేంద్ర నిబంధనలకు అనుగుణంగా మేము అన్ని పాటిస్తుంటే... తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా నిబంధనలు అతిక్రమిస్తున్నారని శ్రీధర్ బాబు ఆరోపించారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలు-ఎంపీలు మాత్రమే ప్రెస్​మీట్ పెట్టాలని స్పీకర్ ఆదేశాలు ఉన్నాయి. మరి ఎమ్మెల్యే కానీ వ్యక్తి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఎలా ప్రెస్ మీట్ పెట్టారంటూ ప్రశ్నించారు.

ఇదీ చూడండి:'వన్​టైం సెటిల్​మెంట్​ను అందరూ వినియోగించుకోండి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details