గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. గాంధీభవన్లో హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల కమిటీలు సమావేశమయ్యాయి. వీరు జాబితాను సిద్ధం చేసి పీసీసీకి పంపనున్నారు.
రేపు సాయంత్రానికల్లా గ్రేటర్ తొలి జాబితా : కాంగ్రెస్ - హైదరాబాద్ సమాచారం
జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి. రేపు సాయంత్రానికి కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే అవకాశమున్నట్లు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి.
రేపు సాయంత్రానికల్లా గ్రేటర్ తొలి జాబితా : కాంగ్రెస్
అభ్యర్థుల ఎంపికపైనే ప్రధానంగా చర్చించారు. రేపు సాయంత్రానికి జీహెచ్ఎంసీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశమున్నట్లు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో షబ్బీర్ అలీ, కుసుమకుమార్, పొన్న ప్రభాకర్, వీహెచ్, గీతారెడ్డి, దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు.