తెలంగాణ

telangana

వర్సిటీల ప్రైవేటీకరణకు ప్రభుత్వ కుట్ర: భట్టి

By

Published : Jun 1, 2020, 1:31 PM IST

Updated : Jun 1, 2020, 3:17 PM IST

హైదరాబాద్‌ రాజ్​భవన్​లో గవర్నర్ తమిళిసైను కాంగ్రెస్​ సీనియర్​ నేతలు కలిశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములు ఆక్రమణకు గురవుతున్నాయని భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, వీహెచ్​ ఫిర్యాదు చేశారు. ఓయూ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని గవర్నర్​ను కోరామని భట్టి తెలిపారు.

వర్సిటీలను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర: భట్టి
వర్సిటీలను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర: భట్టి

రాష్ట్రంలో వర్సిటీలను ప్రైవేటు పరం చేసేందుకు తెరాస ప్రభుత్వం కుట్రలు చేస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములను కాపాడాలంటూ.. కాంగ్రెస్ నేతల బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. వర్సిటీ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉన్నత విద్య మెరుగుపడుతుందని ఆశిస్తే... ప్రభుత్వం మాత్రం వర్సిటీలను నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తోందన్నారు.

గవర్నర్​కు ఫిర్యాదు పత్రం ఇస్తున్న నేతలు

"విశ్వవిద్యాలయాలను ఆక్రమించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కుట్ర పూరితంగా.. పరోక్షంగా సంకేతాలు ఇస్తుంది. వర్సిటీలను కావాలనే నిర్వీర్యం చేస్తూ ప్రవేటుపరం చేస్తుంది. అందులోనే భాగంగా ఓయూ భూములు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకోవట్లేదు."

-భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

కేంద్ర, రాష్ట్ర పెద్దల అండతో తులసి సహకారం సంఘం ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములను ఆక్రమిస్తున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు. కేంద్ర సర్వే విభాగంతో విశ్వవిద్యాలయ భూములు సర్వే చేయించాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇవీ చూడండి:సోమవారం నుంచి మరో 200 ప్రత్యేక రైళ్లు

Last Updated : Jun 1, 2020, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details