తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం మతపరమైన ఎజెండాను అనుసరిస్తున్నారు: షబ్బీర్ అలీ

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మతపరమైన ఎజెండాను అనుసరిస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్‌ అలీ ఆరోపించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం పది మంది వైస్‌–ఛాన్స్​లర్లను నియమించిన జాబితాను చూస్తే ఈ విషయం అర్థమవుతోందని విమర్శించారు. వీసీగా నియమించేందుకు విద్యావంతుడైన ఒక్క ముస్లిం కూడా ప్రభుత్వానికి దొరకలేదా అని ప్రశ్నించారు.

congress leader Shabbir ali
మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్‌ అలీ

By

Published : May 23, 2021, 8:05 PM IST

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు వైస్​ ఛాన్స్​లర్లను నియామకాల్లో ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించలేదని కాంగ్రెస్ నేత షబ్బీర్​ అలీ విమర్శించారు. వీసీగా నియమించేందుకు విద్యావంతుడైన ఒక్క ముస్లిం కూడా ప్రభుత్వానికి దొరకలేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ లౌకికవాదినని చెప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆచరణలో మాత్రం మతపరమైన ఎజెండాను అమలు చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్, సభ్యుల నియామకాల్లోనూ మొండిచేయి చూపారని విమర్శించారు. లాక్‌డౌన్‌ పేరుతో పోలీసులు ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చాలా ప్రాంతాల్లో మినహాయింపు ఉన్న వారిని కూడా కొట్టారని ఆరోపించారు. మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేయకుండా డీజీపీని అభ్యర్థించే దుస్థితి ఏర్పడిందన్నారు. లాక్‌డౌన్​లో పాసులు ఉండి ఆహారం సరఫరా చేసే వారిని అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. బాధితుల నుంచి అన్యాయంగా స్వాధీనం చేసుకున్న వాహనాలన్నింటినీ విడుదల చేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:గాంధీభవన్‌లో మూడు ఉచిత అంబులెన్సులు ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details