తెలంగాణ

telangana

By

Published : Sep 12, 2020, 7:59 AM IST

ETV Bharat / state

తెరాస హయాంలో అభివృద్ధి శూన్యం: దాసోజు శ్రవణ్​

తెరాస ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్​ నాయకులు అంజన్​కుమార్​ యాదవ్​, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​కుమార్​లు మండిపడ్డారు. తెరాస హయాంలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు.

congress leader Dasoju Shravan Kumar on ghmc
తెరాస హయాంలో అభివృద్ధి శూన్యం: దాసోజు శ్రవణ్​

తెరాస హయాంలో హైదరాబాద్​లో జరిగిన అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్​ సీనియర్​ నేత అంజన్​కుమార్​ యాదవ్​, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​కుమార్​లు ఆరోపించారు. జీహెచ్​ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీకి సేవలు అందిస్తున్న వారిని డివిజన్ల అధ్యక్షులుగా నియమిస్తూ.. పలువురికి నియామక పత్రాలను అందజేశారు.

కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారన్న ఆయన... చిన్న చిన్న విబేధాలు ఏవైనా ఉంటే వాటిని పక్కన పెట్టి పని చేయాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ హయంలో జరిగిన అభివృద్ధిని తెలియజేసి ఓట్లు పొందాలని పేర్కొన్నారు. తెరాస పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. విద్యుత్తు బిల్లులు, ఇంటి పన్నులు, మంచినీటి బిల్లులు తెరాస వచ్చిన తర్వాతనే పెరిగాయని... వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ నాయకులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి :'కేసీఆర్ అసెంబ్లీని ఫామ్ హౌస్​లో పెట్టుకుంటే బాగుంటుంది'

ABOUT THE AUTHOR

...view details