తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ గడ్డపై జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాలు

Congress Election Campaign in Telangana 2023 : ఆంధ్రప్రదేశ్ రాజకీయ నష్టాన్ని భరించి.. తెలంగాణ ప్రజల ఆకాంక్షల నెరవేర్చినా.. అధికార పీఠం దక్కలేదనే ఆవేదన.. కాంగ్రెస్​ని తీవ్రంగా వెంటాడుతోంది. వ్యూహాత్మక తప్పిదాలు, పొత్తుల్లో చేసిన పొరపాట్లే.. 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో ఓటమికి కారణమని గ్రహించిన పార్టీ.. ఈసారి ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వకూడదనే భావనతో బరిలోకి దిగింది. బీఆర్ఎస్ పాలన వైఫల్యాలు, ప్రజల్లో ఆ పార్టీపై పెరుగుతున్న వ్యతిరేకతను ప్రధాన అస్త్రంగా మలుచుకున్న కాంగ్రెస్.. ఆరు గ్యారెంటీలతో బలంగా జనంలోకి చొచ్చుకెళ్లింది. ఒకదశలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు ఉన్న పరిస్థితిని తట్టుకుని.. ఈసారి కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందనే స్థితికి చేరుకుంది.

By ETV Bharat Telangana Team

Published : Nov 2, 2023, 3:46 PM IST

Telangana Congress Elections planning 2023
Congress Election Campaign in Telangana 2023

తెలంగాణ గడ్డపై జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాలు

Congress Election Campaign in Telangana 2023 : రాజకీయంగా నష్టపోయినా.. తెలంగాణ ఇచ్చామంటున్న కాంగ్రెస్.. రెండుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటమి చవి చూసింది. గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు, వ్యూహాల్లో పొరపాట్లను సరిదిద్దుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి బలంగా బరిలోకి దూసుకొచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడించాలనే కసితో.. నాయకులంతా అభిప్రాయబేధాలు పక్కనపెట్టి సమష్టిగా పోరాడుతున్నారు.

Telangana Congress Elections planning 2023 : ఇటీవల వచ్చిన కొన్ని సర్వేల్లో అధికారం హస్తానికే దక్కుతుందనే అంచనాలు.. కాంగ్రెస్​లో జోష్​ నింపాయి. కర్ణాటకలో కాషాయదళం ఓటమి సహా బండి సంజయ్​ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో కేసీఆర్ ఓటమే లక్ష్యంగా బీజేపీలో చేరిన నాయకులు చెయ్యి పార్టీ వైపు చూశారు. బీఆర్ఎస్​లో టిక్కెట్​ దక్కని అసంతృప్త నేతలు, తటస్థులూ.. కాంగ్రెస్​ గూటికే చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతలుగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి మహబూబ్​నగర్ బీఆర్ఎస్ సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు.. కాంగ్రెస్ కండువా కప్పుకోవడం కలిసి వచ్చింది.

బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, రేఖానాయక్, రాథోడ్ బాపూరావు, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి సహా మాజీ ఎమ్మెల్సీలు, కీలక నాయకుల చేరికతో.. కాంగ్రెస్ నూతనోత్సాహం ఉరకలెత్తింది. కేసీఆర్​ని గద్దె దింపడమే లక్ష్యంగా బీజేపీలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, ఆయన కుమారుడు వంశీ కాంగ్రెస్​లో చేరారు. కొత్త నేతలతో పాటు పార్టీని వీడిన వాళ్లూ తిరిగి రావడంతో.. కాంగ్రెస్​ బలంగా ఎన్నికల రణక్షేత్రంలో నిలబడింది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ డ్యామేజీనే మైలేజీగా వాడుకుంటున్న కాంగ్రెస్, ఈ శతాబ్దపు అతిపెద్ద స్కామ్ అంటూ వినూత్న ప్రచారం

Telangana Election Campaign 2023 : బీఆర్ఎస్​ను బలంగా ఢీకొట్టేందుకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ సుదీర్ఘ కసరత్తే చేసింది. టికెట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. వెయ్యికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులను వడబోసిన ప్రదేశ్ఎన్నికల కమిటీ.. మురళీదరన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీకి 300 మంది పేర్లను సూచించింది. గెలుపు అవకాశాలు, పార్టీ విధేయత, సర్వేలు ప్రాతిపదికగా సుదీర్ఘ వడపోతల అనంతరం.. అక్టోబరు 15న.. 55 మంది పేర్లతో తొలి జాబితా ప్రకటించారు. సిట్టింగ్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సీనియర్ నాయకులు ఉండడంతో.. మొదటి జాబితాపై.. పెద్దగా అసమ్మతి బయట పడలేదు. ఉప్పల్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, నియోజకవర్గాలల్లో అసమ్మతి చెలరేగింది. సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి పార్టీని వీడి బీఆర్ఎస్​లో చేరారు. కొందరు నాయకుల్ని.. రాష్ట్ర నాయకత్వం బజ్జగించింది.

రెండో జాబితాలో 45 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా.. పెద్దఎత్తున అసంతృప్తి చెలరేగింది. అసమ్మతి నేతలు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ.. రెబల్స్​గా బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. సుదీర్ఘకాలం పార్టీ కోసం పని చేసిన తమకు కాకుండా.. రాత్రికి రాత్రి పార్టీలో చేరిన వారికి టిక్కెట్లు ఇచ్చారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు ప్రకటించిన 100 మంది అభ్యర్థుల్లో 28 మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జానారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన నలుగురు సభ్యుల సమన్వయ కమిటీ, ఏఐసీసీ పంపిన ప్రత్యేక పరిశీలకులు.. అసంతృప్తి నేతల్ని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఐనా కొందరు నేతలు పార్టీని వీడుతున్నారు.

Political Parties Focus on Hyderabad : హైదరాబాద్‌కు అధినేతలు రావాలి ప్రచారం హోరెత్తాలి భాగ్యనగర ఓటర్ల మనసు గెలుచుకోవాలి

Opposition parties Telangana Elections Campaign 2023 : జడ్చర్ల టికెట్ ఆశించి భంగపాటుకు గురైన ఎర్రశేఖర్, జూబ్లీహిల్స్ టికెట్ దక్కని విష్ణవర్ధన్ రెడ్డిలో చేరారు. మహేశ్వరం టికెట్ ఆశించి నిరాశకు గురైన పారిజాత నర్సింహారెడ్డి, ఎల్బీనగర్​లో టికెట్ దక్కని మల్​రెడ్డి రామిరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇబ్రహీంపట్నంలో దండెం రామిరెడ్డి, నర్సాపూర్​లో గాలి అనిల్ కుమార్.. పార్టీపై గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సభలతో జనంలోకి చొచ్చుకెళ్లేలా.. పీసీసీ ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్తోంది.

బస్సుయాత్ర, పాదయాత్రలతో ప్రచారాన్ని పదునెక్కిస్తోంది. మూడో జాబితా వెలువడగానే మరింత దూకుడుగా జనంలోకి వెళ్లాలని నిర్ణయించింది. ఇందిరా భవన్​లో ఏర్పాటు చేసిన వార్ రూమ్ వేదికగా.. ఓటర్లకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ హామీలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ అగ్రనేతలు చేస్తున్న విమర్శలకు సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు దీటైన బదులిస్తున్నారు.

అధికార బీఆర్ఎస్​కు దీటుగా ప్రచారాలతో హోరెత్తిస్తున్న విపక్షాలు రోడ్‌షోలు, బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్తున్న నేతలు

ప్రచారంలో కాంగ్రెస్​ తగ్గేదేలే- ఉచిత హామీలతో ఓటర్లలో ఫుల్​ జోష్​, డైలమాలో బీజేపీ!

ABOUT THE AUTHOR

...view details