తెలంగాణ

telangana

Congress CWC Meeting Arrangements in Telangana : 'ఎన్ని ప్రయత్నాలు చేసినా.. విజయభేరి సభను ఆపలేరు'

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2023, 7:56 PM IST

Updated : Sep 9, 2023, 8:43 PM IST

Congress CWC Meeting Arrangements in Telangana : తెలంగాణలో కాంగ్రెస్​ నిర్వహించనున్న విజయభేరి సభను జరగకుండా బీజేపీ, బీఆర్​ఎస్​ కుట్రలు పన్నుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ఆరోపించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా విజయభేరీ సభ... ఖమ్మంలో జరిగిన ప్రజాగర్జన మాదిరి.. విజయవంతమవుతుందని.. ధీమా వ్యక్తం చేశారు.

Telangana Assembly Elections 2023
Revanth Reddy Speech on Vijayabheri Sabha

Congress CWC Meeting Arrangements in Telangana : ఈ నెల 17న విజయభేరి సభలో సోనియాగాంధీ 5 గ్యారంటీలను ప్రకటించనున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. విజయభేరీ సభ కోసం మొదట పరేడ్ గ్రౌండ్‌ కోసం డిఫెన్స్ అధికారులను అడిగామని... కానీ బీజేపీ తమ ప్రతిష్ఠను కాపాడుకునేందుకు కేంద్రం తరపున రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. బీజేపీ, బీఆర్​ఎస్ కుట్ర చేసి పరేడ్ గ్రౌండ్‌ను కాంగ్రెస్‌కు ఇవ్వకుండా చేశారని ఆరోపించారు. గచ్చిబౌలి స్టేడియం అడిగినా స్పోర్ట్స్ అథారిటీ తిరస్కరించిందని స్పష్టం చేశారు. ట్రాఫిక్ సమస్య లేకుండా తుక్కుగూడలో ఖాళీ స్థలంలో నిర్వహించాలనుకున్నామని.. కానీ దేవాదాయ భూములు ఉన్నాయని అందులో కూడా అనుమతి నిరాకరించారని మండిపడ్డారు. కాంగ్రెస్ సభ జరిగితే బీఆర్​ఎస్​ పతనం ఖాయమని దేవుడిని అడ్డుపెట్టుకుని అనుమతి రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Vijayabheri Meeting Arrangements in Telangana : సభ నిర్వహించేందుకు తుక్కుగూడ రైతులే ముందుకొచ్చి తమ భూములు ఇచ్చారన్నారు. యుద్ధ ప్రాతిపదికన తమ పార్టీ నాయకులు భూములు చదును చేసి సభకు ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఇచ్చిన నాయకురాలు సోనియా వస్తుంటే.. ప్రభుత్వం సహకరించి విజ్ఞతను ప్రదర్శించాలే కాని.. దురదృష్టవశాత్తు ఆ విజ్ఞత మఖ్యమంత్రి కేసీఆర్​కు లేదని విమర్శించారు. ప్రజాస్వామిక విలువలు కాపాడే ఆలోచన ఆయనకు లేదని ధ్వజమెత్తారు. సీడబ్ల్యూసీ సమావేశాలకు ఒక హోటల్​ను మాట్లాడుకుంటే.. మంత్రి కేటీఆర్ ఆ హోటల్ యాజమాన్యాన్ని బెదిరించి కాంగ్రెస్‌కు ఇవ్వొద్దని చెప్పారని ఆరోపించారు. ఈ విషయాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.

Officials Denied Permission to Congress Meeting : కాంగ్రెస్​కు మళ్లీ ఎదురుదెబ్బ.. తుక్కుగూడలో సభాస్థలి నిర్వహణకు అనుమతి నిరాకరణ

Revanth Reddy on CWC Meeting : ఈ నెల 16న హైదరాబాద్​లోని తాజ్​కృష్ణాలో సీడబ్ల్యూసీ సమావేశం ఉంటుందని స్పష్టం చేశారు. 17న విజయభేరి సభలో 5గ్యారెంటీలను సోనియాగాంధీ ప్రకటిస్తారని ప్రకటించారు. ఖమ్మం సభకు ఎన్ని ఆటంకాలు కలిగించినా ఎలా విజయవంతం చేశారో.. ఆ సభ స్ఫూర్తిగా ఈ విజయభేరి సభకు లక్షలాది మంది యువకులు, రైతులు, నిరుద్యోగులు తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు.

CWC Meeting in Hyderabad : సీడబ్ల్యూసీలో దేశ రాజకీయాలను మలుపు తిప్పే నిర్ణయాలు ఉంటాయని రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీపై భారత్ జోడో ప్రభావం పడిందని.. ఇండియా కూటమిని నిలువరించలేక 'ఇండియా(INDIA)' పదాన్ని తొలంగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే భారత్ అని పేరు మారుస్తామంటున్నారు. ఏడాది ముందే రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర చేశారని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి, కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ సభను అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు.

"రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ 90లక్షల ఓట్లు తెచ్చుకుంటే 90 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 43లక్షల డిజిటల్‌ సభ్యత్వం చేశాం.. వంద రోజులు పార్టీ కోసం కష్టపడితే రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం వస్తుంది. కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారు.. రజాకర్లు కూడా ఇంత దోపిడీ, విధ్వంసానికి పాల్పడలేదు. సీడబ్ల్యూసీ సమావేశాలు తెలంగాణలో నిర్వహిస్తున్నందుకు సోనియాగాంధీ, ఖర్గే కృతజ్ఞతలు తెలిపారు."- రేవంత్​ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

Congress CWC Meeting Arrangements in Telangana ఎన్ని ప్రయత్నాలు చేసినా.. విజయభేరి సభను ఆపలేరు

Revanthreddy Chitchat on CWC Meetings Security : రాష్ట్ర డీజీపీని కలిసిన రేవంత్​రెడ్డి.. కాంగ్రెస్​ సమావేశాలకు భద్రత కల్పించాలని వినతి

Revanth Reddy Letter to CM KCR : 'ఒక్క సంతకంతో రెగ్యులర్ చేస్తామన్న హామీ ఏమైంది?'

Congress Screening Committee Meeting : 'అభ్యర్థుల జాబితా ఇప్పుడే తేల్చలేం.. మరోసారి భేటీ అయ్యాక చెబుతాం'

Last Updated : Sep 9, 2023, 8:43 PM IST

ABOUT THE AUTHOR

...view details