Congress Bus yatra Starts on 18th October : అసెంబ్లీ ఎన్నికల కోసంకాంగ్రెస్ ప్రచారం (Congress Bus Yatra) ములుగు నుంచి ప్రారంభం కానుంది. కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొంటున్న బస్సు యాత్ర ద్వారా ప్రచారం జరగనుంది. ఇవాళ సాయంత్రం ములుగులోని రామప్ప గుడిలో రాహుల్, ప్రియాంక గాంధీలు ప్రత్యేక పూజలు చేస్తారు. ములుగులో పబ్లిక్ మీటింగ్ తర్వాత బస్సు యాత్రలో భూపాలపల్లి చేరుకుని రాత్రి బస చేస్తారు. రెండో రోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నిరుద్యోగ యువతతో పాదయాత్ర చేస్తారు.
ఆ తర్వాత రామగుండంలో సింగరేణి, ఎన్టీపీసీ కార్మిక సంఘాలతో సమావేశం అవుతారు. అక్కడ నుంచి సాయంత్రానికి పెద్దపల్లి చేరుకుంటారు. అక్కడ పబ్లిక్ మీటింగ్ తర్వాత రైస్ మిల్లర్స్ సంఘాలతో పాటు రైతులతో ఇష్టాగోష్టి నిర్వహిస్తారు. అక్కడ నుంచి సాయంత్రానికి కరీంనగర్ చేరుకుని పాదయాత్రలో పాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు కరీంనగర్ నుంచి బోధన్ చేరుకుంటారు.
Telangana Congress Bus Yatra 2023 : తిరగబడదాం- తరిమికొడదాం అనే నినాదంతో.. కాంగ్రెస్ బస్సు యాత్ర
Rahul Gandhi Telangana Tour : ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బీడీ కార్మికులు, గల్ఫ్ వలస కార్మికుల కుటుంబాలతో ఇంటరాక్షన్ ఉంటుంది. అనంతరం నిజామ్ షుగర్ ఫ్యాక్టరీ సందర్శిస్తారు. అక్కడ నుంచి సాయంత్రం 4 గంటలకు ఆర్మూరు చేరుకుని పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. అక్కడ నుంచి రాత్రి 7 గంటలకు నిజామాబాద్ చేరుకొని పాదయాత్రలో పాల్గొంటారు.