తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రచారంలో కాంగ్రెస్ వెనుకంజ.. అభ్యర్థుల ఒంటరి పోరు

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఒంటరి పోరాటం చేస్తున్నారు.. ముఖ్యనేతలు బరిలో ఉండటంతో వారంతా నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. ఫలితంగా ఇతర పార్టీలతో పోలిస్తే ప్రచారంలో టీ కాంగ్రెస్ వెనుకబడింది. రాహుల్​ మలిదశ ప్రచార సభలు రద్దు కావడం హస్తం శ్రేణుల్ని నిరాశకు గురిచేసింది. 40మంది ప్రచార తారలు ఉన్నా ప్రచారంలో స్థానిక నేతలు తప్ప ఇంకెవరులేకుండా పోయారు.

By

Published : Apr 7, 2019, 6:47 AM IST

Updated : Apr 7, 2019, 7:04 AM IST

కాంగ్రెస్​ ఎన్నికల ప్రచారం

లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ప్రచారంలో ఒంటరి పోరాటం చేస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలు ఎన్నికల బరిలో ఉండటం వల్ల వారంతా ఆయా నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. మూడు, నాలుగు లోక్​సభ నియోజక వర్గాలు మినహా మిగతా చోట్ల అభ్యర్థులు, స్థానిక నేతలే ప్రచారం చేస్తున్నారు. ఒక్కో లోక్​సభ స్థానం పరిధిలో పార్టీ తరఫున ఒక్క భారీ కార్యక్రమం కూడా నిర్వహించలేదనే అభిప్రాయాన్ని పలువురు పార్టీ ఎంపీ అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు.

నియోజకవర్గానికే పరిమితం

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి నల్గొండ నుంచి బరిలో నిలవడం వల్ల ఆయన పూర్తి స్థాయిలో నియోజకవర్గానికే పరిమితం కావల్సి వచ్చింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్​రెడ్డి మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనను అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి నియోజకవర్గంలోనే ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ శాసన సభాపక్షనేత మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం లోక్​సభ స్థానంపై దృష్టి పెట్టారు. టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్​ పర్సన్​ విజయశాంతి మాత్రమే పలుచోట్ల ప్రచారంలో పాల్గొంటున్నారు.

రాహుల్​ మలిదశ ప్రచార సభలు రద్దు

రాహుల్​ మలిదశ ప్రచార సభలు రద్దు కావడం కాంగ్రెస్ శ్రేణుల్ని నిరాశకు గురిచేసింది. 40మంది ప్రచార తారలు ఉన్నా ప్రచారంలో స్థానిక నేతలు తప్ప ఇంకెవరూ లేకుండా పోయారు. శాసన సభ ఎన్నికల్లో పార్టీ ప్రచారం ప్రణాళిక బద్దంగా సాగినా, లోక్​సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి పీసీసీ నుంచి షెడ్యూలు కూడా రూపొందించలేక పోయారు.

కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థుల ఒంటరి పోరాటం

ఇవీ చూడండి:సోషల్​ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు: కవిత

Last Updated : Apr 7, 2019, 7:04 AM IST

ABOUT THE AUTHOR

...view details