తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీ దవాఖానా వద్ద భాజపా, ఎమ్​ఐఎమ్​ మధ్య ఉద్రిక్తత - హైదరాబాద్​లో బస్తీ దవాఖానాలు

హైదరాబాద్​ పాత బస్తీ పటేల్​నగర్​లోని నూతన బస్తీ దవాఖానా వద్ద భాజపాకి, ఎమ్​ఐఎమ్​కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ ఎమ్మెల్యేపై భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్​ఐఎమ్​కి విరుద్ధంగా నినాదాలు చేశారు.

conflicts between mim and bjp in old city
బస్తీ దవాఖాన వద్ద భాజపా, ఎమ్​ఐఎమ్​ మధ్య ఉద్రిక్తత

By

Published : Nov 12, 2020, 2:42 PM IST

హైదరాబాద్​ పాత బస్తీ పటేల్ నగర్​లో బస్తీ దవాఖాన ప్రారంభం అనంతరం ఆ ప్రాంతంలో భాజపా, ఎమ్​ఐఎమ్​ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దవాఖాన పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రికి వ్యతిరేకంగా 'గో బ్యాక్' అంటూ భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు.

బస్తీ దవాఖానాను డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ప్రారంభించి వెళ్లాక ఎమ్మెల్యే అక్కడకు వచ్చారు. నియోజక వర్గంలో ఉన్న సమస్యలు పరిష్కరించకుండా, వరద బాధితులను ఆదుకోకుండా ఇప్పుడు ఎందుకొచ్చారని స్థానిక భాజపా నేతలు, కార్యకర్తలు.. ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఆ సమయంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దిన అనంతరం ఎమ్మెల్యే అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ఇదీ చదవండి:కొత్త జెర్సీల్లో భారత క్రికెటర్లు.. ఆ సిరీస్​ కోసమే!

ABOUT THE AUTHOR

...view details