తెలంగాణ

telangana

ETV Bharat / state

కింగ్​కోఠి ఆసుపత్రిలో మూడో రోజూ కొనసాగిన ఆందోళన - కింగ్​కోఠిలో వైద్య సిబ్బంది ఆందోళన వార్తలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తోన్న వైద్య సిబ్బందికి ప్రభుత్వం ఇస్తానన్న 10 శాతం ఇన్సెంటివ్ తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్​ చేస్తూ కింగ్​కోఠి ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఆందోళన చేపట్టారు.

Concern continued for a third day at King Kothi Hospital
కింగ్​కోఠి ఆసుపత్రిలో మూడో రోజూ కొనసాగిన ఆందోళన

By

Published : Aug 7, 2020, 12:18 PM IST

హైదరాబాద్ కింగ్ కోఠి ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఆందోళన మూడో రోజూ కొనసాగింది. కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నా.. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న తమను ప్రభుత్వం గుర్తించడం లేదంటూ వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి వైద్యులు తమకు క్వారంటైన్ సెలవులు సైతం ఇవ్వడం లేదంటూ ఆరోపించారు.

ప్రభుత్వం 10 శాతం ఇన్సెంటివ్ ఇస్తానని చెప్పి, మాట తప్పిందని.. వెంటనే ఇన్సెంటివ్​తో పాటు క్వారంటైన్ సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీచూడండి: సులువైన పరిష్కారాల కోసం బ్లాక్​ చైన్​ టెక్నాలజీ

ABOUT THE AUTHOR

...view details