తెలంగాణ

telangana

ETV Bharat / state

రిపోర్టర్ మనోజ్​ మృతిపై హెచ్​ఆర్​సీలో ఫిర్యాదు - complaint to hrc about doctors negligence at gandhi hospital

హైదరాబాద్​ గాంధీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ ఛానెల్ విలేకరి మరణించాడంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో జర్నలిస్టు ఫోరం ఫర్​ తెలంగాణ సభ్యులు ఫిర్యాదు చేశారు. సానుకూలంగా స్పందించిన హెచ్​ఆర్​సీ ఆగస్టు 17లోపు మనోజ్​ మృతిపై నివేదిక అందించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేసింది.

complaint to hrc about doctors negligence at gandhi hospital
విలేకరి మనోజ్​ మృతిపై హెచ్​ఆర్​సీలో ఫిర్యాదు

By

Published : Jun 23, 2020, 10:48 AM IST

హైదరాబాద్​ గాంధీ ఆసుపత్రిలో కనీస వసతుల్లేకపోవడం, సరైన వైద్యం అందకపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఓ ఛానెల్​ విలేకరి చనిపోయాడంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో జర్నలిస్టు ఫోరం ఫర్​ తెలంగాణ సభ్యులు ఫిర్యాదు చేశారు. జూన్​ 4న మనోజ్​ అనే విలేకరి.. సోదరుడితో కలిసి గాంధీలో చేరగా.. అర్ధరాత్రి తీవ్రంగా ఆయాసపడుతున్న విలేకరికి కనీసం ఆక్సిజన్​ అందించకపోగా ఐసీయూలోకి తరలించలేదని ఫోరం నేతలు కమిషన్​ దృష్టికి తీసుకెళ్లారు.

వైద్యుల నిర్లక్ష్యం వల్లే విలేకరి చనిపోయాడని... అతని కుటుంబానికి రూ. కోటి పరిహారం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కమిషన్​ను కోరారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఘటనపై స్పందించిన హెచ్​ఆర్​సీ ఆగస్టు 17లోపు మనోజ్​ మృతిపై నివేదిక అందించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేసింది.

ఇవీ చూడండి:కర్నల్​ సంతోష్​బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details