తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్యుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం.. హెచ్​ఆర్సీలో ఫిర్యాదు - Covid-19 latest updates

వైద్యులకు రక్షణ సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఓ న్యాయవాది హెచ్​ఆర్సీని ఆశ్రయించాడు. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని కమిషన్​ కోరుతూ ఇ-మెయిల్ ద్వారా మానవహక్కుల కమిషన్​కు ఫిర్యాదు చేశారు.

Complaint in HRC over government negligence attitude towards doctors
వైద్యుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై హెచ్​ఆర్సీలో ఫిర్యాదు

By

Published : Apr 9, 2020, 6:27 AM IST

కరోనా కాలంలో అవిరామంగా పనిచేస్తున్న వైద్యుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అమీర్​పేటకు చెందిన న్యాయవాది హెచ్​ఆర్సీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కొరతగా ఉన్న మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు కోసం తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ విరాళాలు కోరుతున్నట్లు కొన్ని దినపత్రికలో వచ్చిన కథనాలను తన ఫిర్యాదుతో జాతపరిచారు. ఈ అత్యవసర సమయంలో వైద్యులకు ప్రాథమిక రక్షణ కల్పించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని న్యాయవాది తులసిరాజ్​ పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై కమిషన్ జోక్యం చేసుకొని... వైద్యులకు సరిపడా రక్షణ పరికరాలు సరఫరా చేసే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్... ఈ నెల 16లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ హెల్త్ మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్​కు ఆదేశాలు జారీచేసింది.

ఇదీ చూడండి :'ధాన్యం సేకరణపై సమస్యలుంటే సంప్రదించండి

ABOUT THE AUTHOR

...view details