ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం వాంబే కాలనీ సమీపంలో రెండు పాములు జనాలను పరుగులు పెట్టించాయి. నివాస గృహాల వద్ద ఉన్న ఈ రెండు పాముల్ని గ్రీన్ మెర్సీ రెస్క్యూ టీం నేర్పుగా పట్టుకుంది. వీటిలో ఆరు అడుగుల కొండచిలువ, ఐదు అడుగుల రేట్ స్నేక్ ఉన్నాయి. గ్రీన్ మెర్సీ సీఈఓ రమణమూర్తి చాకచక్యంగా ఈ రెండు పాముల్ని బంధించి.. జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయానికి తరలించారు. డీఎఫ్ఓ సందీప్ కృపాకర్ సూచన మేరకు ఈ రెండు పాముల్ని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
శ్రీకాకుళంలో కొండ చిలువ.. భయంతో జనం పరుగులు - srikakulam snakes news
పాము పేరు వింటేనే కొందరు భయపడతారు. అలాంటిది వంపులు తిరిగే కొండ చిలువను చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి ప్రాణులను ఎంతో చాకచక్యంగా పట్టుకున్న వీడియోలో మీరూ చూసేయండి.
![శ్రీకాకుళంలో కొండ చిలువ.. భయంతో జనం పరుగులు cobra-and-snakes-are-moving-at-wambay-colony-in-srikakulam-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7388099-930-7388099-1590718211148.jpg)
శ్రీకాకుళంలో కొండ చిలువ.. భయంతో జనం పరుగులు