తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా అగ్రనాయకుల మాటలు హాస్యాస్పదం : ఎమ్మెల్యే సాయన్న

సికింద్రాబాద్ కంటోన్మెంట్​ నియోజకవర్గంపై అవగాహన లేకుండా భాజపా అగ్రనాయకులు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే సాయన్న విమర్శించారు. కరీంనగర్​ నుంచి వచ్చిన బండిసంజయ్​కు ఇక్కడ పరిస్థితులు తెలియవన్నారు. సీఎంపై అనవసరంగా నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

By

Published : Nov 8, 2020, 8:12 PM IST

Cntonment MLA sayanna fire on bjp leaders
భాజపా అగ్రనాయకుల మాటలు హాస్యాస్పదం : ఎమ్మెల్యే సాయన్న

కేసీఆర్, కేటీఆర్​పై భాజపా అగ్రనాయకులు దురుసుగా మాట్లాడితే సహించేది లేదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న హెచ్చరించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంపై సరైన అవగాహన లేకుండా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కొంతమంది తెరాసను వీడినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదని తెలిపారు.

కరీంనగర్​పై పట్టున్న బండిసంజయ్​కు కంటోన్మెంట్ పరిస్థితులు తెలియవన్నారు. కరోనా సమయంలో లక్షమందికి భోజనాలు అందించిన ఘనత తెరాసకే దక్కుతుందని బోయిన్​పల్లి మార్కెట్ ఛైర్మన్ శ్రీనివాస్ పేర్కొన్నారు. వరద సాయంలో ఎక్కడ అక్రమాలు జరిగాయో నిరూపించాలని సవాలు విసిరారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి కంటోన్మెంట్ అభివృద్ధి చేస్తే తాము కూడా సంతోషిస్తామని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి:వరద సాయంపై ప్రధానికి లేఖరాసినా స్పందించలేదు: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details