తెలంగాణ

telangana

ETV Bharat / state

నీటి కేటాయింపుల్లో రాజీపడే ప్రసక్తే లేదు: కేసీఆర్‌

రాయలసీమ ఎత్తిపోతల అంశంపై సభలో భట్టి అడిగిన ప్రశ్నకు సీఎం కేసీఆర్ జవాబిచ్చారు. నీటి అంశంపై ఎంతైనా పోరాటం చేస్తామని తెలిపారు. చుక్క నీటిని కూడా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‌

By

Published : Mar 26, 2021, 5:18 PM IST

CM KCR, assembly sessions 2021
. రాయలసీమ ఎత్తిపోతల అంశంపై కేసీఆర్

నీటి కేటాయింపుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని... అవసరమైతే శాసనసభ్యులను మొత్తాన్ని తీసుకెళ్లి దిల్లీలో కూర్చుంటామన్నారు. రాయలసీమ ఎత్తిపోతల అంశంపై సభలో భట్టి అడిగిన ప్రశ్నకు జవాబిచ్చిన కేసీఆర్​.... నీటి అంశంలో రాజీ లేదని తెలిపారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై స్టేలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆర్డీఎస్​ విషయంలోనూ... ఏపీ ప్రభుత్వం అసంబద్ధంగా వెళ్తోందని... నీటి హక్కులను వదులుకునే ప్రసక్తి లేదన్నారు. ఆర్డీఎస్ నుంచి 15.9 టీఎంసీల నీటిని కచ్చితంగా తీసుకుంటామని స్పష్టం చేశారు.

రాయలసీమ ఎత్తిపోతల అంశంపై కేసీఆర్ ప్రసంగం

ABOUT THE AUTHOR

...view details