తెలంగాణ

telangana

By

Published : Jun 14, 2020, 8:21 PM IST

Updated : Jun 14, 2020, 8:47 PM IST

ETV Bharat / state

'ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యం.. 50 వేల మందికి పరీక్షలు'

corona cases
కరోనాపై సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం

14:54 June 14

కరోనాపై సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం

కరోనా పరీక్షలు, చికిత్సల విషయంలో సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు ల్యాబ్‌లు, ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు, చికిత్సకు అనుమతిచ్చారు. 

ప్రైవేటులో కరోనా పరీక్షలు, చికిత్సకు మార్గదర్శకాలు, ధరలు నిర్ణయించాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

30 నియోజకవర్గాల పరిధిలో 50వేల మందికి పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్, చుట్టుపక్కన 4 జిల్లాలపై ఎక్కువ దృష్టి సారించాలన్న సీఎం... పాజిటివ్‌గా తేలినప్పటికీ వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేనివారికి ఇంట్లోనే చికిత్స అందించాలని తెలిపారు. బాధితులకు చికిత్స అందించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మరోసారి స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: కరోనాపై కేసీఆర్ సమీక్ష... మంత్రి ఈటల, అధికారులతో కీలక చర్చ

Last Updated : Jun 14, 2020, 8:47 PM IST

ABOUT THE AUTHOR

...view details