కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో లాక్డౌన్ అమలు అవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈనెల 20 వరకు యథావిధిగా లాక్డౌన్ కొనసాగుతుందని, ఆ తరువాతనే అవసరాల మేరకు సడలింపులు ఉంటాయని చెప్పారు. లాక్డౌన్, పేదలకు సాయంలో ప్రజాప్రతినిధుల చొరవ, ప్రజల సహకారం కొనసాగాలని సూచించారు.
ఎంతమందికైనా కరోనా పరీక్షలు చేసేందుకు సిద్ధం: కేసీఆర్ - కరోనా
తెలంగాణలో ఎంతమందికైనా కరోనా పరీక్షలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్లోని ప్రగతిభవన్లో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
![ఎంతమందికైనా కరోనా పరీక్షలు చేసేందుకు సిద్ధం: కేసీఆర్ CM KCR serious comments on Carona virus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6806798-611-6806798-1586961139783.jpg)
CM KCR serious comments on Carona virus
ఎంత మందికైనా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ అన్నారు. కొవిడ్-19 వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.