తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇక చర్చలకు ఆస్కారమే లేదు: సీఎం - KCR Review On TSRTC

అందర్నీ ఇబ్బందులకు గురిచేస్తూ... చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న కార్మిక సంఘాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. చర్చలకు ఆస్కారమే లేదని తేల్చి చెప్పారు. ఓ వైపు సమ్మె, మరోవైపు సంస్థ నష్టాల్లో ఉన్నందున ఆర్టీసీకి కొత్త ఎండీని నియమించడం సాధ్యం కాదని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వైఖరిని న్యాయస్థానం ముందు బలంగా వినిపించాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.

ఇక చర్చలకు ఆస్కారమే లేదు: సీఎం

By

Published : Oct 17, 2019, 5:07 AM IST

Updated : Oct 17, 2019, 11:58 AM IST

సమ్మె ద్వారా ఆర్టీసీకి కార్మిక సంఘాలు తీవ్ర నష్టం చేశాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు సంస్థ 150 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని ఆయన తెలిపారు. ఇది పూడ్చలేని లోటు అని అభిప్రాయపడ్డారు. సంస్థ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా కార్మిక సంఘాలు అనాలోచింతగా సమ్మెకు వెళ్లాయని.. ఎట్టి పరిస్థితుల్లో వారితో చర్చలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గడువులోగా విధుల్లో చేరని వారిని మళ్లీ తీసుకునే అవకాశం లేదని ప్రకటించారు.

ఇక చర్చలకు ఆస్కారమే లేదు: సీఎం

కొత్త ఎండీ సాధ్యం కాదు...

ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ఎండీ నియామకం సాధ్యంకాదనే విషయాన్ని న్యాయస్థానానికి వివరించాలని అధికారులకు సీఎం ఆదేశించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు సర్కారు 44 శాతం ఫిట్​మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిందని సీఎం గుర్తు చేశారు. ఎన్నడు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం 3 వేల 300 కోట్ల మేర ఆర్టీసీకి సాయం అందించినట్లు వెల్లడించారు.

అనుభవం ఉన్నవారినే తీసుకోండి...

తర్వలో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడక్కడ అద్దె బస్సులతో ప్రమాదాలు జరుగుతున్నాయని... అలాంటి పరిస్థితి లేకుండా చూడాలని కేసీఆర్​ స్పష్టం చేశారు. అనుభవం ఉన్న వారిని మాత్రమే డ్రైవర్‌గా ఎంపిక చేయాలని సీఎం ఆదేశించారు.

ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష

Last Updated : Oct 17, 2019, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details