తెలంగాణ

telangana

జ్వాలా రచనలు ప్రజలకు ఉపయోగకరం: కేసీఆర్

By

Published : Dec 27, 2020, 7:27 PM IST

ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు తాను రచించిన పుస్తకాలను ప్రగతి భవన్​లో సీఎం కేసీఆర్​కు అందించారు. అందులో రాష్ట్రంలో తీసుకొచ్చిన పలు సంస్కరణలు, చట్టాల అమలును వివరించినట్లు తెలిపారు. ఈ పుస్తకాలు ప్రజలకు ఉపయోగపడతాయని సీఎం కొనియాడారు.

cm-kcr-pr-jwala-narasimha-rao-books-presentation-to-cm-kcr-in-pragathi-bhavan
జ్వాలా రచనలు ప్రజలకు ఉపయోగం: కేసీఆర్

ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు ఇటీవల రచించిన ‘తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఎట్ ఎ గ్లాన్స్', శ్రీ మద్భాగవత కథల పుస్తకాలను సీఎం కేసీఆర్​కు ప్రగతి భవన్​లో అందించారు. రాష్ట్రంలో తీసుకొచ్చిన పరిపాలనా సంస్కరణలు, రెవెన్యూ చట్టాల అమలు, తీరు తెన్నులపై విశ్లేషణాత్మకమైన వ్యాసాలతో తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఎట్ ఎ గ్లాన్స్ గ్రంథంలో వివరించారు.

మహాకవి బమ్మెర పోతనామాత్యుడు రచించిన మహా భాగవతం ఆధారంగా శ్రీమద్భాగవత కథలను సంక్షిప్తీకరించారు. ప్రజలకు ఉపయోగపడే రచనలు చేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రచయిత జ్వాలాను అభినందించారు.

ఇదీ చదవండి:'వచ్చే ఏడాది నుంచి ధాన్యం కొనుగోలు, నియంత్రిత సాగు ఉండదు'

ABOUT THE AUTHOR

...view details