తెలంగాణ

telangana

By

Published : Mar 21, 2020, 6:57 PM IST

ETV Bharat / state

'మా బస్సులు బంద్.. మీ బస్సులు కూడా రావొద్దు'

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రేపు రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఆదివారం రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల సేవలు నిలిచిపోనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.

Cm kcr on rtc busses over corona issue
రేపు రాష్ట్రంలో బస్సులు బంద్

జనతా కర్ఫ్యూలో భాగంగా రేపు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను నడపబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రం సాధించుకున్న స్ఫూర్తిగా కరోనా కట్టడిలో పాలుపంచుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల బస్సులు కూడా రావొద్దని సీఎం తెలిపారు. పక్క రాష్ట్రాల బస్సులను 24 గంటల పాటు రాష్ట్రంలోకి రానివ్వమన్నారు.

అత్యవసర పరిస్థితులు ఏర్పడితే సేవలు అందించడానికి డిపోకు ఐదు బస్సులు సిద్ధంగా ఉంటాయని సీఎం పేర్కొన్నారు.

రేపు రాష్ట్రంలో బస్సులు బంద్

ఇవీ చూడండి:జనతా కర్ఫ్యూ: ఆ 12 ఎంఎంటీఎస్​ సర్వీసులు యథాతథం

ABOUT THE AUTHOR

...view details