తెలంగాణ

telangana

ETV Bharat / state

మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో 172 మందికి కరోనా: కేసీఆర్ - cm kcr on corona situation in telangana

దిల్లీ మర్కజ్​ వెళ్లొచ్చిన వారిలో 172 మందికి కరోనా సోకిందని సీఎం కేసీఆర్​ తెలిపారు. వీరి ద్వారా 93 మందికి పాజిటివ్​ వచ్చిందన్నారు.

cm kcr on corona situation in telangana
మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో 172 మందికి కరోనా

By

Published : Apr 6, 2020, 7:46 PM IST

రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 11 మంది మృతి చెందారని ముఖ్యమంత్రి కేసీఆర్​ వెల్లడించారు. గాంధీలో 308 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. మర్కజ్ వెళ్లిన వారిలో ఇప్పటివరకు 1089 మందిని గుర్తించామన్నారు. 30 నుంచి 35 మంది దిల్లీలోనే ఉన్నారని చెప్పారు.

మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో 172 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని వీరి ద్వారా 93 మందికి వైరస్​ సోకిందన్నారు. చనిపోయిన వారందరూ మర్కజ్ వెళ్లొచ్చిన వారేనని స్పష్టం చేశారు.

మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో 172 మందికి కరోనా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details