తెలంగాణ

telangana

ETV Bharat / state

శాసనసభ నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ

ఎర్రమంజిల్​లో అసెంబ్లీ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రోడ్లు, భవనాల శాఖ ఆవరణలో శాసనసభ నిర్మాణానికి సీఎం భూమిపూజ చేశారు.

By

Published : Jun 27, 2019, 12:07 PM IST

kcr

శాసనసభ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఎర్రమంజిల్‌లోని రోడ్లు, భవనాల శాఖ ఆవరణలో శాసనసభ నిర్మాణానికి సీఎం భూమిపూజ చేశారు. అంతకుముందు సచివాలయా నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈకార్యక్రమంలోసభాపతి, మంత్రులు, పలువురు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఎర్రమంజిల్​లోని పురాతన భవన స్థానంలో అసెంబ్లీ, కౌన్సిల్ సహా సెంట్రల్ హాల్ ఉండేలా కొత్త భవనాన్ని నిర్మిస్తారు. ప్రస్తుత అసెంబ్లీ చారిత్రక భవనం నమూనాలోనే కొత్త శాసనసభ భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. అసెంబ్లీ భవన నిర్మాణం కోసం వంద కోట్లకు పైగా వ్యయం అవుతుందని అంచనా.

శాసనసభ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన

ఇదీ చూడండి: నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details