తెలంగాణ

telangana

By

Published : Jan 9, 2021, 10:48 AM IST

Updated : Jan 9, 2021, 11:39 AM IST

ETV Bharat / state

మొదటి విడత గొర్రెల పంపిణీని పూర్తి చేయాలని సీఎం ఆదేశం

kcr
kcr

10:47 January 09

మొదటి విడత గొర్రెల పంపిణీని పూర్తి చేయాలని సీఎం కేసీఆర్​ ఆదేశం

రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కార్యక్రమం మళ్లీ ప్రారంభం కానుంది. మొదటి విడత గొర్రెల పంపిణీని పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్​ ఆదేశించారు. రాష్ట్రంలోని గొల్ల, కురుమలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీని ప్రభుత్వం చేపట్టింది. మొదటి విడతలో మూడు లక్షలా 67 వేల యూనిట్లు పంపిణీ చేశారు. కరోనాతో ఆ కార్యక్రమం చివరి దశలో నిలిచిపోయింది. అప్పటికే దాదాపు 30 వేల మందికి పైగా డీడీలు కట్టి ఉన్నారు. ప్రస్తుతం వారందరికీ తక్షణమే గొర్రెలు పంపిణీ చేయాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులను సీఎం  ఆదేశించారు.  

 వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్​లో దీనికి సంబంధించి నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్

Last Updated : Jan 9, 2021, 11:39 AM IST

ABOUT THE AUTHOR

...view details