అక్రమాస్తుల కేసుల్లో మొదటి నిందితుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి... కచ్చితంగా హాజరు కావాలని ఈ నెల 24న సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇవాళ హాజరవుతారా లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. సీబీఐ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం హైకోర్టును జగన్ ఆశ్రయించినప్పటికీ.. విచారణ ఫిబ్రవరి 6కి వాయిదా పడింది.
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుపై నేడే విచారణ...
సీబీఐ, ఈడీ కోర్టులో నేడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరగనుంది. సీబీఐ 11 ఛార్జిషీట్లు.. ఈడీ 5 అభియోగ పత్రాలపై విచారణ చేపట్టనున్నారు.
cm jagan illegal assets cases inquiry today
ఈ రోజు విచారణకైనా మినహాయింపు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా.. తమ వద్ద పిటిషన్ పెండింగులో ఉందని.. సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లొచ్చని జగన్ తరఫు న్యాయవాదులకు హైకోర్టు ఇటీవల సూచించింది.
ఇదీ చదవండి:అక్రమాస్తుల కేసులో జగన్ పిటిషన్లు కొట్టివేసిన సీబీఐ కోర్టు
Last Updated : Jan 31, 2020, 7:11 AM IST