తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడు, నాలుగు రోజుల్లో రైతులందరికీ యూరియా: కేసీఆర్

రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న యూరియా కొరతను తక్షణమే నివారించాలని సీఎం కేసీఆర్​... అధికారులను ఆదేశించారు. మూడు, నాలుగు రోజుల్లోగా రైతుల డిమాండ్​కు సరిపడా ఎరువులు అందజేస్తామని తెలిపారు.

By

Published : Sep 6, 2019, 6:29 PM IST

'రైతులందరికీ యూరియా అందించాలని సీఎం ఆదేశం'

రాష్ట్రంలోని రైతులందరికీ సరిపోయేంత యూరియాను తక్షణమే సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మూడు.. నాలుగు రోజుల్లోగా రైతుల డిమాండ్​కు అనుగుణంగా అన్ని గ్రామాలకు యూరియా పంపిణీ చేయాలని సూచించారు. వివిధ నౌకాశ్రయాల్లో ఉన్న నిల్వలను తక్షణమే రైళ్లు, లారీల ద్వారా తెప్పించాలని... వాటిని స్టాక్​ పాయింట్లలో నిల్వ చేయకుండా నేరుగా గ్రామాలకే తరలించాలన్నారు. ఈ సందర్భంగా గతంలో ఎన్నడూ లేనంతగా యూరియా సమస్య తలెత్తడానిక గల కారణాలను వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

For All Latest Updates

TAGGED:

ureacm kcr

ABOUT THE AUTHOR

...view details