పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ ఉద్యోగులు, చౌక ధరల దుకాణాల డీలర్లను ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించి టీకా ఇప్పించాలని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ను ఆయన కలిసి ఓ వినతిపత్రం సమర్పించారు.
మే నెల నుంచి అదనపు బియ్యం పంపిణీ చేయాల్సి ఉన్నందున ఇప్పటికే చాలా చోట్ల అధికారులు, సిబ్బంది, రేషన్ డీలర్లు కరోనా బారిన పడ్డారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అత్యవసర సేవల కింద పని చేసిన పౌరసరఫరాల సంస్థ ఉద్యోగులకు, రేషన్ డీలర్లకు మానవతా దృక్పథంతో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పోలీస్ శాఖ, జీహెచ్ఎంసీ సిబ్బంది మాదిరిగానే ఫ్రంట్లైన్ వారియర్స్ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. గత ఏడాది కరోనా ఆరంభం, లాక్డౌన్ సమయంలో పౌరసరఫరాల ఉద్యోగులను అత్యవసర సేవలు కింద ప్రభుత్వం గుర్తించడంతో బాగా పనిచేశారని అన్నారు. అత్యవసర సేవలు ఉండటంతో ఎలాంటి మినహాయింపులు తీసుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు యాసంగిలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు జరిపామని చెప్పారు.