తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంచు మోహన్బాబు, మంచు విష్ణు.. కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. నటి కీర్తి సురేష్ స్వామి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమలలో పెరిగిన రద్దీ.. శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు.. - తిరుమల తాాజా సమాచారం
తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.
![తిరుమలలో పెరిగిన రద్దీ.. శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు.. శ్రీవారి సేవలో సినీప్రముఖలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10196018-1066-10196018-1610335625635.jpg)
శ్రీవారి సేవలో సినీప్రముఖులు
2020 సంవత్సరం లాంటి రోజులు ఎన్నడూ రాకూడదని స్వామివారిని ప్రార్థించినట్లు మోహన్బాబు తెలిపారు. తాను నటించిన సన్నాఫ్ ఇండియా చిత్రం ఫిబ్రవరిలో విడుదలవుతుందన్నారు. నటులను చూసిన భక్తులు.. వారితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబర్చారు.
శ్రీవారి సేవలో సినీప్రముఖులు
ఇదీ చదవండి:రైతు బంధు సాయం కింద రూ.7351.74 కోట్లు పంపిణీ