సామాజిక మాధ్యమాల్లో రాజకీయ పోస్టులను ఫార్వర్డ్ చేసినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడిని పోలీసులు అరెస్టు చేశారు. నలంద కిశోర్ అనే వ్యక్తిని తెల్లవారుజామున 3 గంటల సమయంలో విశాఖపట్నంలోని సీబీఎం కాంపౌండ్లోని ఆయన నివాసంలో సీఐడీ అదుపులోకి తీసుకుంది.
తెదేపా సానుభూతిపరుడిని అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు - తెదేపా సానుభూతిపరుడు నలంద కిషోర్ అరెస్ట్ వార్తలు
తెదేపా సానుభూతిపరుడు నలంద కిషోర్ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి అవంతి, విజయసాయిరెడ్డిలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులను ఫార్వర్డ్ చేశారంటూ జూన్ 20న కిషోర్కు సీఐడీ నోటీస్ ఇచ్చింది. జూన్ 23న తెల్లవారుజామున పోలీసులు కిషోర్ను అదుపులోకి తీసుకున్నారు.

తెదేపా సానుభూతిపరుడిని అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు
ఆరోగ్యం సరిగా లేదని.. ఉదయం వస్తానని చెప్పినా.. పోలీసులు వినలేదని కిషోర్ బంధువులు తెలిపారు. మాజీమంత్రి గంటా శ్రీనివాసరావుకి నలంద కిషోర్ అనుచరుడు కావడం వల్ల ఈ అరెస్టు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డిపై ప్రచారంలో ఉన్న పోస్టులను నలంద కిషోర్ ఫార్వర్డ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇదీ చదవండి:డిగ్రీ, బీటెక్ పరీక్షలపై కీలక నిర్ణయం నేడు?