సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 18న చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి కన్వీనర్ జెరూసలేం మత్తయ్య తెలిపారు. రిజర్వేషన్లు, క్రైస్తవ మైనార్టీలపై దాడుల నివారణకు ప్రత్యేక చట్టం... క్రైస్తవులకు ప్రత్యేక బడ్జెట్ తదితర డిమాండ్లతో ఈ నిరసనకు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు.
'క్రైస్తవ సమస్యల పరిష్కారానికి 18న చలో అసెంబ్లీ' - తెలంగాణలోక్రైస్తవుల వార్తలు
క్రైస్తవుల సమస్యలు పరిష్కారం కోరుతూ ఈ నెల 18న చలో అసెంబ్లీ పేరుతో నిరసన ప్రదర్శన చేపడతామని క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి కన్వీనర్ జెరూసలేం మత్తయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి క్రైస్తవులు హాజరుకావాలని కోరారు.
'క్రైస్తవుల డిమాండ్లు పరిష్కరించాలి'
రాష్ట్రంలో క్రైస్తవుల సమస్యల పరిష్కారంలో... క్రైస్తవులపై జరుగుతున్న దాడుల నివారణకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నారని మత్తయ్య ఆరోపించారు.
ఇదీ చూడండి:భారత్లో 107కు చేరుకున్న కరోనా కేసులు