ప్రముఖ కూలింగ్ ఉత్పత్తుల సంస్థ రాక్వెల్ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కొవిడ్ వ్యాక్సిన్ స్టోరేజ్ కోసం సోలార్, విండ్ పవర్తో పనిచేసే ఫ్రీజర్ను మార్కెట్లోకి విడుదల చేసింది. చిల్లర్ మిల్ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫ్రీజర్లను ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ ప్రారంభించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరమైన కొవిడ్ టీకాలను భద్రపరిచేందుకు వీలుగా ఈ ఫ్రీజర్లను రూపొందించినట్లు ఆ సంస్థ ఎం.డి. అశోక్ గుప్తా పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ చిల్లర్మిల్లకు డబ్ల్యూహెచ్వో పీక్యూఎస్ సర్టిఫికేషన్తో పాటు నైపర్ నుంచి అనుమతులు లభించటం గర్వించే విషయమన్నారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఈ ఫ్రీజర్లు వ్యాక్సిన్ను అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద భద్రపరిచే సామర్థ్యం కలిగి ఉండటంతో పాటు నిరంతరంగా సోలార్, విండ్ పవర్తో పనిచేస్తాయని వివరించారు.