సికింద్రాబాద్లోని కంటైన్మెంట్ పరిధిలోని 5వ వార్డులో సామాజిక కార్యకర్త తేలుకుంట సతీష్ గుప్త ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైట్ రసాయనిక ద్రావణాలను పిచికారి చేశారు. కరోనా మహమ్మారి నిర్మూలనలో భాగంగా పలు బస్తీలలో ఇంటింటికి తిరుగుతూ... తన వంతు సహాయంగా రసాయనక ద్రావణాలను పిచికారీ చేయించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానికులకు అవగాహన కల్పించారు. దూరం పాటించాలని... స్వీయ నియంత్రణ పాటించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
'స్వీయ నియంత్రణలు పాటిస్తూ... పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి'
స్వీయ నియంత్రణలు పాటిస్తూ... పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని... జాగ్రత్తలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త తేలుకుంట సతీష్ సికింద్రాబాద్లోని కంటైన్మెంట్లో ఉంటున్న వారికి సూచించారు.
'స్వీయ నియంత్రణలు పాటిస్తూ... పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి'