జీహెచ్ఎంసీ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో నిర్ధరించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ నెల ఏడో తేదీన వార్డుల వారీ ముసాయిదా జాబితా ప్రకటించనున్న నేపథ్యంలో పేర్లు నిర్ధరించుకోవాలని... జాబితాలో పేరు లేనట్లైతే వెంటనే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఓటరు అవగాహన, ప్రచార కమిటీతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమావేశమయ్యారు.
ceotelangana.nic.in, nsvp.in వెబ్సైట్లు లేదా ఈసేవా కేంద్రాల్లో పేర్లు తనిఖీ చేసుకోవాలని ఎస్ఈసీ సూచించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసే వరకు ఓటర్ల నమోదుకు గడువు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషర్ పార్థసారథి తెలిపారు. అసెంబ్లీ ఓటరు జాబితాలో ఉండి వార్డుల వారీ ముసాయిదా జాబితాలో లేకపోతే వెంటనే సంబంధిత డిప్యూటీ మున్సిపల్ కమిషనర్కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.