హైదరాబాద్లో అవసరమైనచోట తెదేపా కార్యకర్తలు, నాయకులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.
'హైదరాబాద్ ముంపు బాధితులకు అండగా నిలవండి' - chandrababu comments on hyderabad floods
భాగ్యనగరంలో వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తెదేపా కార్యకర్తలు అండగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ప్రజల భద్రత కోసం తాను ప్రార్థిస్తున్నట్లు ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.

'హైదరాబాద్ ముంపు బాధితులకు కార్యకర్తలు అండగా నిలవండి'
జలప్రళయం తగ్గే వరకు భాగ్యనగర వాసులు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఎవరికి వారు సురక్షితంగా ఇళ్లలోనే ఉండి కుటుంబసభ్యులను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. ప్రజల భద్రత కోసం తాను ప్రార్థిస్తున్నట్లు ట్విటర్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి :తమిళనాడు సీఎం పళనిస్వామికి కేసీఆర్ ఫోన్