తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసుల తీరుకు నిరసనగా బైక్ ఎక్కిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్​లోని​ గుంటూరు బైపాస్ వద్ద తెదేపా శ్రేణుల బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవటంతో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. యువకుల బైక్ తాళాలు లాక్కున్న పోలీసులపై మండిపడ్డారు. వాహనశ్రేణి దిగి ద్విచక్రవాహనం ఎక్కారు.

By

Published : Jan 12, 2020, 5:58 PM IST

chandrababu-fire-on-police-for-stopping-a-bike-rally
బాబు ఆగ్రహం.. బైక్​ ఎక్కడం

చంద్రబాబు రాక నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు బైపాస్ వద్ద తెదేపా శ్రేణులు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించాయి. దీనిని పోలీసులు అడ్డుకుని... బైక్ తాళాలు లాక్కున్నారు. ఇది తెలుసుకున్న చంద్రబాబు వెంటనే వాహనశ్రేణి దిగి రోడ్డుపైకి వచ్చారు. బైక్ తాళాలు తిరిగి ఇచ్చేయాలని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది న్యాయమా అంటూ పోలీసులను నిలదీశారు. తప్పుడు పనులు చేయవద్దంటూ హితవు పలికారు. అయినప్పటికీ పోలీసులు తాళాలు ఇవ్వకపోవటంతో చంద్రబాబు ద్విచక్రవాహనం ఎక్కారు. అనంతరం యువకుల బైక్ తాళాలను పోలీసులు తిరిగిచ్చేశారు.

బాబు ఆగ్రహం.. బైక్​ ఎక్కడం

ఇదీ చదవండి:వింటే నామినేటెడ్ పదవులు.. లేకుంటే వేటే!

ABOUT THE AUTHOR

...view details