ఏపీలో పరిషత్ ఎన్నికల నిలుపుదల రాజ్యాంగ విజయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా ప్రభుత్వ అరాచకానికి ఏపీ హైకోర్టు ఉత్తర్వులు చెంపపెట్టన్నారు. ఈ తీర్పుతో తెదేపా ఎన్నికల బహిష్కరణ నిర్ణయం సరైందిగా రుజువైనట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. కోర్టుల మార్గదర్శకాలు ధిక్కరించడాన్ని జగన్ ఇకనైనా మానాలని హితవు పలికారు.
వైకాపా ప్రభుత్వ అరాచకానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు: చంద్రబాబు - ap news
ఏపీలో పరిషత్ ఎన్నికల విషయంలో.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు... వైకాపా ప్రభుత్వ అరాచకానికి చెంపపెట్టని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. తెదేపా ఎన్నికల బహిష్కరణ నిర్ణయం సరైనదిగా రుజువైందని పేర్కొన్నారు.
![వైకాపా ప్రభుత్వ అరాచకానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు: చంద్రబాబు ttp, ap](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11303164-385-11303164-1617711819436.jpg)
chandrababu, ap news
ఎస్ఈసీ రబ్బరు స్టాంపుగా కాకుండా.. చట్ట ప్రకారం స్వతంత్రంగా వ్యవహరించాలని చంద్రబాబు పేర్కొన్నారు. పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి ఏడాది దాటిందన్న చంద్రబాబు... కొత్త ఓటర్లకు అవకాశమిచ్చేలా మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:ప్రజాక్షేత్రంలో చెమటోడ్చుతున్న అభ్యర్థులు