తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆషాడ మాసంలో ఆదివారం రోజున ప్రత్యేక పూజలు.. - devotional news

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతేలోని శ్రీ వెంకటేశ్వర స్వామి, జ్ఞాన సరస్వతి, ఆంజనేయస్వామి, సంతాన నాగదేవత సహిత ఆలయంలో చండీ యజ్ఞం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

chandi yagnam held in mothe village
ఆషాడ మాసం పురస్కరించుకొని మోతేలో చండీ యజ్ఞం

By

Published : Jun 28, 2020, 5:18 PM IST

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతేలోని శ్రీ వెంకటేశ్వర స్వామి, జ్ఞాన సరస్వతి, ఆంజనేయస్వామి, సంతాన నాగదేవత సహిత ఆలయంలో చండీ యజ్ఞం నిర్వహించారు. ఆలయంలో అభిషేకం, కుంకుమార్చన అనంతరం చండీ యజ్ఞం నిర్వహించారు.

కరోనా ప్రభావంతో భక్తులు పరిమిత సంఖ్యలో హాజరయ్యారు. మొత్తం పది జంటలు చండీ యజ్ఞంలో పాల్గొన్నారు. ఆషాడ మాసం సందర్భంగా జ్ఞాన సరస్వతి మాత... శాకంబరీ దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ ధర్మకర్త భాస్కర రావు చండీ యజ్ఞాన్ని నిర్వహించారు.

శాకంబరీ దేవి అలంకరణలో అమ్మవారు

ఇదీ చదవండి:కరోనా విలయ తాండవం.. రాష్ట్రంలో 13వేలు దాటిన కేసులు

ABOUT THE AUTHOR

...view details