తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి: చాడ వెంకట్​ రెడ్డి - పేదలను ఆదుకోవాలని చాడ డిమాండ్​ వార్తలు హైదరాబాద్

రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల అనేకమంది పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడం ఏంటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మండిపడ్డారు. అకాల వర్షాలతో పేదల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ వరంగల్ వంటి నగరాల్లో నల్లాలు, చెరువులు, కుంటలు అక్రమాలకు గురికావడం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని వెంకట్​ రెడ్డి ఆరోపించారు.

పేదలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి: చాడ వెంకట్​ రెడ్డి
పేదలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి: చాడ వెంకట్​ రెడ్డి

By

Published : Oct 26, 2020, 4:31 PM IST

హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లో అకాల వర్షాల వల్ల అనేకమంది పేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం ఏంటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి ప్రశ్నించారు. వారి జీవితాలు చిన్నభిన్నం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పేదలను ఆదుకోవాలని చాడ కోరారు.

హైదరాబాద్ వరంగల్ వంటి నగరాల్లో నల్లాలు, చెరువులు, కుంటలు అక్రమాలకు గురికావడం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని వెంకట్​ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నియంతృత్వ వ్యవసాయం కొనసాగుతున్నా.. అకాల వర్షాల వల్ల నష్టపోయిన మొక్కజొన్న రైతులను ఆదుకోవడం అభినందనీయమని కొనియాడారు.

పేదలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి: చాడ వెంకట్​ రెడ్డి

ఇదీ చదవండి:చాడ పుస్తకం రాశారు.. ఈటల ఆవిష్కరించారు..

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details