జేఎన్యూ జరిగిన ఘటనపై పోలీసులు విచారిస్తున్నారని... వీలైనంత త్వరగా నిందితులను అరెస్ట్ చేస్తారని సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సహాయమంత్రి రాందాస్ అథవాలే తెలిపారు.
సీఏఏ వల్ల భారత ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తబోదని హైదరాబాద్ బేగంపేటలో ఎస్సీ డెవలెప్మెంట్ అధికారులతో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ ప్రయోజనాల కోసమే సీఏఏపై రాద్దాంతం చేస్తోందని విమర్శించారు. విద్యార్థులకు అవసరమైన ఉపకార వేతనాలు, బోధనా రుసుములు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.