తెలంగాణ

telangana

By

Published : Oct 31, 2019, 2:30 PM IST

ETV Bharat / state

సమర్థ భారతదేశం అందరి బాధ్యత: పురుషోత్తం రూపాల

గాంధీ సిద్ధాంతాలను నేటి యువతలో మేల్కొల్పాలని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. కూకట్​పల్లి సర్దార్​ పటేల్​ నగర్​ నుంచి భాజపా నిర్వహించిన గాంధీ సంకల్ప యాత్రకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. రాష్ట్రీయ ఏక్​తా దివస్​ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు.

సమర్థ భారతదేశం అందరి బాధ్యత: పురుషోత్తం రూపాల

సమర్థ భారతదేశం అందరి బాధ్యత: పురుషోత్తం రూపాల
మహాత్మాగాంధీ 150వ జయంతి సంవత్సరం, సర్దార్ పటేల్ జయంతి పురస్కరించుకుని ఇవాళ హైదరాబాద్​ కూకట్​పల్లి సర్దార్​ పటేల్​ నగర్​ నుంచి వై జంక్షన్​ వరకు భాజపా.. గాంధీ సంకల్పయాత్ర చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల, ఎమ్మెల్సీ రాంచందర్​ రావులు హాజరయ్యారు.

సమర్థ భారత్​గా నిర్మించాలి:

సత్యం, అహింస వంటి విలువైన సిద్ధాంతాలను గాంధీజీ ప్రపంచానికి చాటి చెప్పారని పురుషోత్తం అన్నారు. ఆ సిద్ధాంతాలను నేటి యువతలో మేల్కొల్పడానికి దేశవ్యాప్తంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పటేల్​ జయంతి అయిన రాష్ట్రీయ ఏక్​తా దివస్​ రోజున ఈ ర్యాలీలో పాల్గొనటం సంతోషంగా ఉందని పురుషోత్తం రూపాల పేర్కొన్నారు. భారత్​ను శ్రేష్ఠ భారత్​, స్వచ్ఛ్​ భారత్​, సమర్థ భారతదేశంగా నిర్మించాల్సిన బాధ్యత అందిరిపైనా ఉందన్నారు.

ఇవీ చూడండి:ఆర్టీసీ ప్రధానాంశంగా ఎల్లుండి "కేబినెట్" సమావేశం

ABOUT THE AUTHOR

...view details