సమర్థ భారత్గా నిర్మించాలి:
సమర్థ భారతదేశం అందరి బాధ్యత: పురుషోత్తం రూపాల - kukatpalli gandhi sankalp ryali
గాంధీ సిద్ధాంతాలను నేటి యువతలో మేల్కొల్పాలని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. కూకట్పల్లి సర్దార్ పటేల్ నగర్ నుంచి భాజపా నిర్వహించిన గాంధీ సంకల్ప యాత్రకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. రాష్ట్రీయ ఏక్తా దివస్ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు.
సమర్థ భారతదేశం అందరి బాధ్యత: పురుషోత్తం రూపాల
సత్యం, అహింస వంటి విలువైన సిద్ధాంతాలను గాంధీజీ ప్రపంచానికి చాటి చెప్పారని పురుషోత్తం అన్నారు. ఆ సిద్ధాంతాలను నేటి యువతలో మేల్కొల్పడానికి దేశవ్యాప్తంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పటేల్ జయంతి అయిన రాష్ట్రీయ ఏక్తా దివస్ రోజున ఈ ర్యాలీలో పాల్గొనటం సంతోషంగా ఉందని పురుషోత్తం రూపాల పేర్కొన్నారు. భారత్ను శ్రేష్ఠ భారత్, స్వచ్ఛ్ భారత్, సమర్థ భారతదేశంగా నిర్మించాల్సిన బాధ్యత అందిరిపైనా ఉందన్నారు.