తెలంగాణ

telangana

By

Published : Feb 18, 2020, 6:28 PM IST

ETV Bharat / state

'ఓవైసీ ఒత్తిడి వల్లే సీఎం కేసీఆర్​ సీఏఏను వ్యతిరేకిస్తున్నారు'

ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీ ఒత్తిడి వల్లే ముఖ్యమంత్రి కేసీఆర్​ సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశారని కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ ఆరోపించారు. పార్లమెంట్​లో ఆమోదం పొందిన బిల్లును రాష్ట్ర కేబినెట్​ వ్యతిరేకించడం బాధాకరమన్నారు.

central minister piyush goyal on telangana government
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి పీయూష్​ ధ్వజం

తెరాస, ఎంఐఎం పార్టీలు ప్రజలను మభ్యపెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ ఆరోపించారు. ఎంపీ ఓవైసీ ఒత్తిడి చేయడం వల్లే ముఖ్యమంత్రి కేసీఆర్​ సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశారన్నారు.

కేంద్రం అందిస్తున్న నిధులతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని పీయూష్ స్పష్టం చేశారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉన్నప్పటికీ 12 శాతం కల్పిస్తామని అబద్ధపు మాటలు చెబుతూ మత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈబీసీ, ఆయుష్మాన్ భవ పథకాల్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

మంత్రి కేటీఆర్​ దిల్లీకి వచ్చిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని చెబుతూ, ఇక్కడ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి ఆక్షేపించారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఏదడిగినా తక్షణమే మంజూరు చేస్తున్నామని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి పీయూష్​ ధ్వజం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details