కరోనా నివారణ చర్యలు ఇప్పటికే ప్రారంభించామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అనేక సూచనలు చేశామని స్పష్టం చేశారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారికి వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. జనవరి 22 నుంచి ఇప్పటివరకు 22 సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. జనవరి 27నుంచి రాష్ట్రాల ఆరోగ్యశాఖ కార్యదర్శులతో పలుసార్లు మాట్లాడామని వివరించారు.
65 నౌకాశ్రయాల వద్ద స్క్రీనింగ్
ప్రతిరోజూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్రమంత్రి రాష్ట్రాలతో సమావేశం అవుతున్నారని చెప్పారు. కరోనా పరిస్థితిపై కేంద్రమంత్రి పార్లమెంటులో ప్రకటన కూడా చేశారన్నారు. సరిహద్దు దేశాల వద్ద కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. కరోనా నివారణకు ఇతర దేశాల్లో తీసుకున్న చర్యలపై ఎప్పటికప్పుడూ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. విదేశాల నుంచి వచ్చేవారిని 28 రోజులపాటు పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఓడల ద్వారా వచ్చే సరకు రవాణాను నిషేధించామని వెల్లడించారు. 65 నౌకాశ్రయాల వద్ద స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. కరోనా నివారణకు ప్రైవేటు ఆస్పత్రుల సేవలనూ వినియోగించుకుంటున్నామని అన్నారు.
ప్రత్యేక నిధి ఏర్పాటు దిశగా ప్రభుత్వం