హెచ్ఎండీఏ సమగ్ర అభివృద్ధి, వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపాలను సరిదిద్దాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి... ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామాల ప్రజలు, ముఖ్యంగా రైతుల సమస్యలను పరిష్కరించాలని.. అక్రమాలకు తావు లేకుండా క్రమపద్ధతిలో అభివృద్ధి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పునః సమీక్షించాలని లేఖలో పేర్కొన్నారు. హెచ్ఎండీఏ, స్థానిక సంస్థల మధ్య సమన్వయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు స్థానిక సంస్థలతో కలిసి ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించాలని కోరారు. నిర్మాణ అనుమతులకై తీసుకువచ్చిన డీపీయంఎస్ సమర్థవంతంగా అమలయ్యేట్లు చూడాలని అన్నారు.