తెలంగాణ

telangana

ETV Bharat / state

Kishan Reddy: భాజపాలో వారికి సరైన గుర్తింపు ఉంటుంది - కేంద్రమంత్రి కిషన్​రెడ్డి తాజా వార్తలు

హైదరాబాద్ అడిక్​మెట్​ డివిజన్ కార్పొరేటర్​ భర్త ప్రకాశ్​గౌడ్ జయంతి, లాక్​డౌన్ సందర్భంగా జీహెచ్ఎంసీ సిబ్బందికి ఆహారాన్ని పంపిణీ చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి (Kishan Reddy). ప్రకాశ్​ గౌడ్​ మరణం పార్టీకి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు.

Central minister kishan reddy
భాజపా

By

Published : Jun 16, 2021, 6:09 PM IST

Updated : Jun 16, 2021, 9:30 PM IST

సమాజానికి అంకిత భావంతో సేవలందించి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న నాయకులు, కార్యకర్తలకు భాజపా (Bjp)... సరైన గుర్తింపు ఇస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. అడిక్​మెట్​ డివిజన్ కార్పొరేటర్ భర్త దివంగత ప్రకాశ్​ గౌడ్ జయంతి.. లాక్​డౌన్ సందర్భంగా జీహెచ్ఎంసీ సిబ్బందికి కిషన్​రెడ్డి (Kishan Reddy), లక్ష్మణ్ ఆహారం పంపిణీ చేశారు.

ప్రకాశ్​ గౌడ్ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందంజలో ఉండేవారని కిషన్​రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందడం పార్టీకి ఆ కుటుంబానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి తన వంతు కర్తవ్యంగా విధులు నిర్వహించిన ప్రకాశ్​ గౌడ్ సేవలు చిరస్మరణీయమని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.

ఇదీ చూడండి: ETV Bharath Effect: చేవెళ్ల ఎంపీ సాయం.. తీరింది రైతు కష్టం..

Last Updated : Jun 16, 2021, 9:30 PM IST

ABOUT THE AUTHOR

...view details