‘గత ఏడాది డిసెంబరులో విద్యుత్ వినియోగదారుల హక్కులు-2020’కు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై కొన్ని సూచనలు చేశాం. ఇందులో నెట్మీటరింగ్కు సంబంధించి వేర్వేరు సంస్థలు, వ్యక్తుల నుంచి అనేక ప్రతిపాదనలు అందాయి. నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ కూడా తమ అభిప్రాయాలను పంపింది. అందుకు అనుగుణంగానే 500 కిలోవాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తంచేసింది’ అని విద్యుత్తు మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ నిబంధనలను పరిశీలించి ఈ నెల 30వ తేదీలోగా అభిప్రాయాలు పంచుకోవాలని మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలను కోరింది. ఇది చిన్న, మధ్య తరహా పరిశ్రమల వారికి ఉపకరించే నిర్ణయమని ఈ రంగంలో నిపుణులు చెబుతున్నారు.
మూడు విధానాల్లో దేన్నయినా ఎంచుకోవచ్చు..
నూతన ముసాయిదాలో గ్రాస్మీటరింగ్, నెట్మీటరింగ్, నెట్ బిల్లింగ్/నెట్ఫీడింగ్ అన్న మూడు విధానాలుంటాయని, వినియోగదారు తనకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చని మంత్రిత్వశాఖ ముసాయిదాలో తెలిపింది. ఈ మూడింటి తేడాను కూడా వివరించింది.
గ్రాస్మీటరింగ్..
ఈ విధానంలో ఉత్పత్తయ్యే సౌర విద్యుత్తు పూర్తిగా గ్రిడ్కు వెళ్తుంది.
నెట్మీటరింగ్..