తెలంగాణ

telangana

ETV Bharat / state

పర్యాటకానికి ఊతం.. దేశీయ యాత్రలకు శ్రీకారం! - దేశీయ యాత్రలకు శ్రీకారం

కరోనా లాక్‌డౌన్‌తో స్తంభించిన పర్యాటక రంగాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. వివిధ పథకాలు, యాత్రల పేర్లతో శ్రీకారం చుట్టింది. దేశీయ పర్యటనలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ.. కొన్నింటికి విమానాలనూ వినియోగించుకోవచ్చని ఐఆర్‌సీటీసీకి దిశానిర్దేశం చేసింది. ప్రత్యేక రైళ్లను కేటాయించింది. భారత్‌ దర్శన్‌, దేఖో అప్నా దేశ్‌ ఇలా వివిధ పేర్లతో పర్యాటకులకు సదవకాశం కల్పించింది.

tourism department
పర్యాటకానికి కేంద్రం ఊతం

By

Published : Jan 25, 2021, 8:30 AM IST

పర్యాటక యాత్రలకు కేంద్రం ఊతమిస్తోంది. భారత్‌ దర్శన్‌, దేఖో అప్నా దేశ్‌ ఇలా వివిధ పథకాలు, పేర్లతో శ్రీకారం చుట్టింది. ప్రత్యేక రైళ్లను కేటాయించింది. దేశీయ పర్యటనలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ.. కొన్నింటికి విమానాలనూ వినియోగించుకోవచ్చని ఐఆర్‌సీటీసీకి దిశానిర్దేశం చేసింది.

సికింద్రాద్‌ నుంచి

  • జగన్నాథ్‌ దామ్‌ యాత్ర.. మార్చి 5నసికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రారంభమవుతుంది. పురి, భువనేశ్వర్‌, కోణార్క్‌ల సందర్శన ఉంటుంది. రూ.5250 టికెట్‌ ధర .
  • రామాయణ యాత్ర పేరిట అయోధ్య నుంచి చిత్రకూట్‌ యాత్ర మార్చి 16న సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభమౌతుంది. అయోధ్య, చిత్రకూట్‌, గయ, నందిగ్రామ్‌, ప్రయాగ్‌, వారణాసి సందర్శన ఉంటుంది. టికెట్‌ ధర రూ.11395.

నగరం నుంచి విమానయాత్రలు

చార్మినార్‌
  • మధ్యప్రదేశ్‌ మహాదర్శన్‌ పేరుతో ఈనెల 27 నుంచి విమానంలో యాత్ర ప్రారంభమవుతుంది. ఇండోర్‌, మహేశ్వర్‌, ఓంకారేశ్వర్‌, ఉజ్జయిని చూడొచ్ఛు టిక్కెట్‌:రూ.18950.
  • సౌరాష్ట్ర యాత్రలో అహ్మదాబాద్‌, ద్వారక, సోమనాథ్‌ గుడి, స్టాచూ ఆఫ్‌ యూనిటీ సందర్శించొచ్ఛు టిక్కెట్‌:రూ.23,300.
  • సౌత్‌గోవా, నార్త్‌ గోవా సందర్శన టిక్కెట్‌: రూ.16,270.

శ్రీనగర్‌ వరకు వెళితే...

  • శ్రీనగర్‌తోపాటు గుల్‌మార్గ్‌, జమ్ము, కత్రా, పహల్గామ్‌, సోన్‌మార్గ్‌ సందర్శనకు టిక్కెట్‌ రూ.16900.
  • పై ప్రదేశాలతో కలిపి మాతా వైష్ణోదేవి యాత్రకు రూ.14760 చెల్లించాలి.
  • మాతావైష్ణోదేవి యాత్రతో పాటు కశ్మీర్‌ పర్యటనకు రూ.13750 టిక్కెట్‌ ధర.
  • గుల్‌మార్గ్‌, పహల్గామ్‌, సోన్‌మార్గ్‌, శ్రీనగర్‌ యాత్రకు రూ.9885.

హైదరాబాద్‌ నుంచి..

వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ వచ్చిన వారికి స్థానికంగా ఐఆర్‌సీటీసీ యాత్రలు నిర్వహిస్తోంది. నగరం, రామోజీ ఫిల్మ్‌ సిటీ సందర్శనకు రూ.3845 టిక్కెట్‌ ధర.

  • సోమవారం, శుక్రవారం మినహా నగర సందర్శనకు రూ.1115, హెరిటేజ్‌ హైదరాబాద్‌ ఒక రోజు యాత్రకు రూ.1170 టిక్కెట్‌ ధర నిర్ణయించారు.
  • హైదరాబాద్‌, శ్రీశైలం, రామోజీ ఫిల్మ్‌ సిటీ సందర్శనకు (సోమవారం, శుక్రవారం మినహా) రూ.8970 టిక్కెట్‌ ధర.

వారణాసి నుంచి..

వారణాసి
  • వారణాసి నుంచి మొదలయ్యే కాశీ యాత్రలో సార్‌నాథ్‌, వారణాసిని చూడొచ్ఛు టిక్కెట్‌ రూ.5810.
  • వారణాసి నుంచి ఉత్తరప్రదేశ్‌ ఆధ్యాత్మిక యాత్రల పేరిట కూడా కొన్ని ప్రవేశపెట్టారు.

పూర్తి వివరాలకు..

www.irctc.com చూడొచ్చు. 04027702401/07, 27808899 నంబర్లలోనూ సంప్రదించవచ్చు.

ABOUT THE AUTHOR

...view details