తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస కార్యాలయం నిర్మాణానికి దిల్లీలో స్థలం కేటాయింపు - తెలంగాణ వార్తలు

దిల్లీలో తెరాస కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయింపు
దిల్లీలో తెరాస కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయింపు

By

Published : Oct 9, 2020, 8:26 PM IST

Updated : Oct 9, 2020, 9:37 PM IST

19:37 October 09

దిల్లీలో తెరాస కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయింపు

 తెరాస పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. దిల్లీ వసంత్ విహార్​లో 1,100 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించారు. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిప్యూటీ ల్యాండ్ డెవలప్​మెంట్ అధికారి దీన్ దయాళ్... ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేఖ రాశారు.

 ఎకరానికి రూ. 25 కోట్ల చొప్పున స్థలానికి ఖరీదు చెల్లించి ఏడాదికి రెండున్నర శాతం అద్దె... రెండు విడతలుగా జనవరి, జులైలో చెల్లించాలని లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ ధర పెరిగితే మిగతా సొమ్ము చెల్లించాలని.. రూ. 10 స్టాంపు పేపరుపై హామీ ఇవ్వాలని తెలిపింది. స్థలం కేటాయింపు పూర్తయినందున త్వరలో శంకుస్థాపన చేసి భవన నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.

Last Updated : Oct 9, 2020, 9:37 PM IST

ABOUT THE AUTHOR

...view details